చిన్న కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రెట్టింపును పెంచుకొనే క్రమంలో ఉన్నట్లుగా సోమవారం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో 80వేల యూనిట్లను ఎగుమతి చేసిన మారుతి ఈ ఆర్థిక సంవత్సరంలో 1.6 లక్షల యూనిట్లను ఎగుమతి చేసే దిశగా పనిచేస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ మార్కెటింగ్, సేల్స్ మయంక్ పరేఖ్ విలేకరులకు వివరించారు. ముఖ్యంగా ఎగుమతులు అత్యధికంగా పెరగటానికి ఉపకరించిన ముఖ్యమైన అంశంగా ఎ-స్టార్ మోడల్ను తెలిపారు. దీనిని విడుదల చేసిన పదకొండు నెలల కాలంలోనే ఒక లక్ష యూనిట్లను విక్రయించగలిగామని వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల యూనిట్లను ఎగుమతి చేయగలమనే లక్ష్యాన్ని కూడా తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా అమ్మకాలు 20 నుంచి 22 శాతానికి పెరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటి దాకా మారుతి 8 లక్షల యూనిట్లను అమ్మగా దేశంలో 7.22 లక్షల యూనిట్లను విక్రయించినట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కార్లను ఉత్పత్తి చేసి 8.4 లక్షల కార్లను అమ్ముతామనే ధీమాను వ్యక్తం చేశారు.
ద్రవ్యోల్బణం కట్టడికి... అస్త్రాలను సిద్ధం చేస్తున్న ఆర్బిఐ
మెరవని భారతీయ ఫండ్లు
3జి స్పెక్ట్రమ్ కోసం ఆఖరి రోజున వెల్లువెత్తిన టెలికం సంస్థల బిడ్లు
మైజింగ్ 'షాపింగ్ పోర్టల్ బై ది ప్రైస్ డాట్ కామ్'
మే ఆఖరుకు పభుత్వ రంగ బ్యాంకుల్లోకి 9 వేల కోట్లు చొప్పించనున్న ప్రభుత్వం
తాత్కాలిక విజిటర్ వీసాలకు యుఎస్ కాన్సులేట్ జనరల్ ఇంటర్వూలు
సాగు ఉత్పత్తి పద్ధతులపై బాయర్ ఎస్సిఐఆర్ఒల ఒప్పందం