ప్రస్తుత పరిస్థితులను చూస్తే బయటి వ్యక్తులతో ఆటగాళ్లు రాయబారం నడుపుతున్నారని, వారు ఒప్పందం చేసుకునేది ఒక విధంగా డబ్బు అందుకునేది మరో పద్ధతిలో అని ఐపిఎల్ మాజీ చీఫ్ మోడీ తెలిపాడు. ఇదే విధానాన్ని అన్ని ఫ్రాంఛైజీ అమలు చేస్తున్నాయన్నాడు. దీన్ని భారత ఆటగాళ్లే కాదు విదేశీయులూ కూడా అమలు చేస్తున్నారన్నాడు. ఐపిఎల్ల్లో ఆటగాళ్ల వేలం విధానమే అవినీతిని, నల్లధన ప్రవాహాన్ని పోత్రహించే విధంగా ఉందని లలిత్ మోడీ పేర్కొన్నాడు. ఆ ఐదుగురు చేసిన తప్పును అందరు ఆటగాళ్లు చేయరన్నాడు. 2008లో మూడు సంవత్సరాల కోసం అవినీతికి ఆస్కారం లేని ఐపిఎల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నాడు. అప్పుడు వ్యవస్థలో నల్లధనం లేదన్నాడు.