ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయాన్నే వీరిరువురు ఢిల్లీకి బయలుదేరనున్నట్లు సమాచారం. ఎంఎల్సి ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారుకోసమే వీరు ఢిల్లీకి వెడు తున్నట్లు చెబుతున్నారు. గురువారం నాడు కూడా ఇరువురు నేతలు ఈ విషయమై చర్చించారు. దాదాపు గంటసేపు క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మరోవైపు డిప్యూటీ సిఎం దామోదర రాజ నర్సింహ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. ముగ్గురు నేతలు ఢిల్లీకి వెడితే ఎంఎల్సి ఎన్నికలతో పాటు, రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
java.lang.NullPointerException