బింద్రాకు స్వర్ణం

    బింద్రా: నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో జరుగుతున్న 33వ బింద్రా ఇంటర్‌షూట్‌ టోర్నమెంట్‌లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ అభినవ్‌ బింద్రా మరో స్వర్ణ పతకం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ విభాగంలో మొత్తం 698.7 పాయింట్లతో ఈ పతకం చేజిక్కించుకున్నాడు. రజిత పతకం జర్మనీకి చెందిన టీనూ మొహౌపత్‌ (697.2)కు దక్కింది. కాంస్య పతకాన్ని నెదర్లాండ్స్‌కు చెందిన పీటర్‌ హెల్లెన్‌బ్రాండ్‌ కైవసం చేసుకున్నాడు. గత గురువారం నాడు జరిగిన పోటీల్లో కూడా బింద్రా 700.1 పాయింట్లతో పసిడి పతకం పండించుకున్నాడు. మహిళల విభాగంలో భారత్‌కు చెందిన సుమా శిరూర్‌ 497.5 పాయింట్లతో స్వర్ణ పతకం చేజిక్కించుకుంది. అవనీత్‌ సిద్ధు రజిత పతకం పొందింది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్