ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగాయిన ఆర్ఐఓ క్రిష్టప్ప తెలిపారు. గురువారం ద్వితీయ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం సబెక్టులకు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 28,267 మందికిగాను 26,832 మంది హాజరైనట్టు తెలిపారు. 1495 మంది గైర్హాజరు అయ్యారన్నారు. ధర్మవరంలోని సంఘమేశ్వర జూనియర్ కళాశాలలో 1011319114 సురేష్ విద్యార్థి స్థానంలో మరో విద్యార్థి శ్రీధర్ పరీక్షలు రాసేందుకు ప్రయత్నించారన్నారు. అధికారుల తనిఖీల్లో అతను పట్టుబడ్డారన్నారు.