న్యూఢిల్లీ : భారత్ తన ఇల్లు అని, తాను కూడా ఈ దేశ పుత్రికనే అని, తనకు ప్రభుత్వం శాశ్వత నివాస అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం నివాస అనుమతి కోసం ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేకుంటే బాగుంటుందని ఆమె అన్నారు. నస్రీన్కు భారత్లో మరో ఏడాది పాటు నివాసం ఉండేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు ఆదివారం తెలిపాయి. దీనిపై నస్రీన్ సోమవారం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అధికారులు తనకు శాశ్వత నివాస అనుమతి ఇస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 5 లేదా 10 సంవత్సరాలకు ఒకసారి ఈ నివాస అనుమతిని కూడా జారీ చేసే అవకాశం ఉందన్నారు. భారత్లోనే తన శేష జీవితం గడపాలనుకుంటున్నానని, అందుకు అనుమతి ఇవ్వాలని 2014లోనే అప్పటి హోంమంత్రి రాజ్నాధ్సింగ్ను కోరినట్లు తెలిపారు. ' నన్ను అందరూ విదేశీయురాలిగా పిలుస్తున్నా, నేను మాత్రం భారత్కు చెందిన వ్యక్తిగానే భావిస్తున్నాను. శాశ్వత నివాస అనుమతి కోసం తన అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని అనుకుంటున్నాను. ఢిల్లీలోనే నాకు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది' అని అన్నారు. స్వీడన్ దేశ పౌరసత్వం కలిగిన తస్లీమా నస్రీన్ 2004 నుంచి నివాస అనుమతి పొందుతూ భారత్తో నివసిస్తున్నారు.
Home »
తాజా వార్తలు »
శాశ్వత నివాస అనుమతి ఇస్తారని ఆశిస్తున్నా : నస్రీన్

సంబందిత వార్తలు
-
మృతదేహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలి : హైకోర్టు ఆదేశం
-
పాకిస్తాన్కు 130 కోట్ల డాలర్ల ఆసియా బ్యాంకు రుణం
-
రాజధానిపై స్పష్టమైన విధానం ప్రకటించి కేంద్రం నుండి నిధులు సాధించాలి
-
దిశకు న్యాయం జరిగింది : మంత్రి, ఎమ్మెల్యేల స్పందన
-
గడిచిన రెండేళ్ళలో 100 మంది ఉగ్రవాదులు అరెస్టు
-
మరో వివాదంలో సాక్షి మహారాజ్
-
నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ ఎన్వీ రమణ
-
144కి మూడు వికెట్లు కోల్పోయిన విండీస్
-
వాలీ బాల్ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినిలు
-
తెలంగాణ పోలీసులకు ఎన్హెచ్ఆర్సి నోటీసులు
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
-
ఈ రాత్రికే నిందితుల అంత్యక్రియలు
-
వివాహిత ఆత్మహత్య
-
విశాఖలో ఉల్లి కోసం తోపులాట.. స్పృహ తప్పిన వినియోగదారులు
-
నా భర్తను చంపినచోటే నన్ను చంపండి : నిందితుడి భార్య
-
నిర్భయ కేసులో వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ ను తోసిపుచ్చండి
-
ఈ రోజు నలుగురు భారత క్రికెటర్ల బర్త్ డే!
-
మోడీకి ఘన స్వాగతం పలికిన ఉద్ధవ్ థాకరే
-
ఎన్కౌంటర్ నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం
-
'దిశ' ఇంటి వద్ద భద్రత పెంపు
-
ఫ్లాగ్ ఫండ్ సేకరించిన వారికి గవర్నర్ సత్కారం
-
అంబేద్కర్ కు ఏలూరు రూరల్ పోలీసుల నివాళి
-
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఈ చలానా క్లియరెన్స్లకు శ్రీకారం
-
కేవలం కృతజ్ఞతలు చెప్పి ధోనీకి వీడ్కోలు పలకలేం: గంగూలీ
-
దిశ నిందితుల ఎన్కౌంటర్పై ప్రముఖుల స్పందన
-
మిస్ మ్యాచ్ మూవీ రివ్యూ
-
రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదు : రాష్ట్రపతి
-
అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటే కఠిన చట్టాలు రూపొందించాలి : మహిళా సంఘాలు
-
బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి: సీపీఐఎంఎల్ లిబరేషన్
-
అంబేద్కర్ కు ప్రత్తిపాడులో న్యాయమూర్తుల నివాళి