నాలుగేళ్లలో 701 దేశద్రోహం కేసులు-5023 ఉపా కేసులు

న్యూఢిల్లీ : 2018-2022 మధ్య కాలంలో దాదాపు 701 దేశద్రోహం కేసులు, నేరాలు నమోదయ్యాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం-యుఎపిఎ కింద 5,023 కేసులు నమోదయ్యాయని చెప్పారు. అయితే, 2021లో 149గా వున్న దేశద్రోహం కేసులు, 2022లో 68కి తగ్గాయని తెలిపారు. అదే యుఎపిఎ కేసులకు వచ్చేసరికి 2021లో 814 నమోదు కాగా, 2022లో 1005కి పెరిగాయని మంత్రి వ్రాతపూర్వక సమాధానంలో తెలిపారు. ఇదే కాలంలో, దేశద్రోహం కేసుల్లో 788 మందిని అరెస్టు చేసి, 500 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేశామని చెప్పారు. 131 మందిని నిర్దోషులగా విడుదల చేసినట్లు కూడా తెలిపారు. యుఎపిఎ కింద 8947 మందిని అరెస్టు చేయగా, 6503పై ఛార్జిషీట్లు దాఖలు చేశారు. 550 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టారు.

➡️