ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని కామేపల్లివారిపాలెం గ్రామానికి చెందిన పెయింటర్ డోలా కోటిలింగం కుమార్తె డోలా శ్రీలేఖ ఒంగోలులోని బొమ్మరిల్లు పిల్లల ఆశ్రమానికి పది సీలింగ్ ఫ్యాన్లను శుక్రవారం అందజేశారు. శ్రీలేఖ హైదరాబాద్లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఉద్యోగం లభించిన తర్వాత పేదలకు ఏదో ఒక విధంగా సహకరించాలన్న తాపత్రయంతో బొమ్మరిల్లు పిల్లల ఆశ్రమానికి రూ.30 వేల విలువ చేసే 10 సీలింగ్ ఫ్యాన్లను శుక్రవారం అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీలేఖ తల్లిదండ్రులు డోలా కోటిలింగం రమాదేవి, ఆమె సోదరి నిఖిత, ప్రజాశక్తి విలేకరి కెవికె ప్రసాద్, బొమ్మరిల్లు ఆశ్రమం నిర్వాహకులు రాజ్యలక్ష్మి, ఎస్ఎండి ఖాసిం పాల్గొన్నారు.