400 మందికి కంటి పరీక్షలు

ప్రజాశక్తి – ముసునూరు

పేదలకు వైద్య సహాయం అందించడంలో ఎంతో మానసిక సంతృప్తి ఉందని అట్లూరి చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత అట్లూరి వెంకట రవీంద్ర పేర్కొన్నారు. గురువారం మండలంలోని రమణక్కపేట గ్రామంలో అట్లూరి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వైద్య నిపుణులు డాక్టర్‌ దత్తం ఆధ్వర్యంలో 10 మంది కంటి వైద్యులు సుమారు 400 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి, వారిలో కొందరికి కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేసి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో లక్క పాము కాంతారావు, గొళ్ల ఆంజనేయులు, వంకదార విగేశ్వర రావు, పాసం నాగబాబు, రంగు వాసు పాల్గొన్నారు.

➡️