రక్షణ భేరి బస్సు యాత్ర

మన్యంలో రెండో రోజు రక్షణ భేరి యాత్ర
మన్యంలో రెండో రోజు రక్షణ భేరి యాత్ర

మన్యం (సీతానగరం) : ప్రజా సమస్యలే అజెండాగా … సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ” రక్షణ భేరి బస్సు యాత్ర ” పార్వతీపురం మన్యంలోని సీతానగరం మండల కమిటీలో రెండో రోజు మంగళవారం ప్రారంభమైంది. సీతానగరం మండల మహిళలు రాష్ట్ర బస్సు యాత్ర జాతా నాయకులకు ఘన ఆహ్వానం పలికారు. ర్యాలీగా ముందుకు సాగారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … అడవులు, భూములు, గనులు వంటి సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతోన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో వైసిపి జతకట్టిందని విమర్శించారు. పేదలకు దళితులకు, గిరిజనులకు ఇచ్చిన భూములను లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో తాగునీరు, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలు తగినంతగా లేవని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోరుతూ … ఈ బస్సు యాత్రను చేపట్టామని శ్రీనివాసరావు తెలిపారు.

➡️