ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం కింద 35,205 మంది విద్యార్థులకు రూ.23.28 కోట్ల లబ్ధి చేకూరింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బహిరంగ సభ నుంచి శుక్రవారం జగనన్న విద్యా దీవెన పథకం కింద జూలై, సెప్టెంబర్ – 2023 త్రైమాసికానికి సంబంధించి నిధులను బటన్ నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లోని బటన్ నొక్కి జమ చేశారు. కలెక్టరేట్ విసి హాల్ నుంచి ఈ కార్యక్రమంలో డిఆర్ఒ అనిత, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రామానందం, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చంద్ర శేఖర్ తదితరులు వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కును అందించారు.