మనబడి ‘నాడు-నేడు’లో రూ.2,253 కోట్లు స్కామ్‌

Dec 13,2023 11:24 #JanaSena, #Nadendla Manohar

 

నాదెండ్ల మనోహర్‌ ఆరోపణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో విద్యారంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతర సంస్థలు కేటాయించిన రూ.6 వేలకోట్లలో రూ.2,253 కోట్లు దారి మళ్లించి అవినీతికి వైసిపి ప్రభుత్వం పాల్పడిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దారి మళ్లిన నిధులపై ముఖ్యమంత్రి సమగ్ర విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్షా ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

➡️