టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళావేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. డా. మురళీమోహన్ 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఎక్సలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు మురళీ మోహన్ అభిమానులు పెద్దయెత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు.