Jan 3,2024 19:57
నరసింహరావు విగ్రహానికి నివాలర్పిస్తున్న దృశ్యం

నరసింహరావు విగ్రహానికి నివాలర్పిస్తున్న దృశ్యం
నరసింహారావు సేవలు మరువలేనివి
ప్రజాశక్తి – లింగసముద్రం : పెదపవనిలో డాక్టర్‌ చెన్ను నరసింహరావు సేవలు మరువలేనివి, ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని పలువురు నేతలు పేర్కొన్నారు. బుధవారం ఉదయం డాక్టర్‌ నరసింహరావు 13వ వర్థంతిని ఆయన కోడలు లింగసముద్రం జడ్‌పిటిసి డాక్టర్‌ చెన్ను నళినిపద్మ, ఆయన కుమారుడు వైసిపి సీనియర్‌ నాయకులు డాక్టర్‌ చెన్ను ప్రసాద్‌ ఆధ్వర్యంలో కార్యక్రమంలో జరిగింది. పలువు నాయకులు, గ్రామస్తులు,బంధువులు ఆయనకు నివాలర్పించారు. కందుకూరు హౌసింగ్‌ డిఈ శ్రీనివాసులు,చినపవని సర్పంచ్‌ దామా సీతారామయ్య, వైసిపి నాయకులు ముత్తినేని వెంకటేశ్వర్లు,కనపర్తి రంగయ్య,సయ్యద్‌ షరిఫ్‌,అప్పిశెట్టి జనార్ధన్‌,ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అప్పిశెట్టి నాగార్జున,తదితరులు పాల్గొన్నారు.

➡️