గంజాయిని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు
- ఇద్దరు అరెస్టు
ప్రజాశక్తి – పలాస
ఒడిశా నుంచి బీహార్కు తరలిస్తున్న రూ.1.20 లక్షల 41 కేజీల గంజాయిని పలాస రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న బీహార్కు చెందిన ఆకాష్ కుమార్, ప్రేమజిత్ కుమార్ను అరెస్టు చేశారు. పలాస రైల్వేస్టేషన్లోని జిఆర్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖపట్నం లైన్స్ రైల్వే సిఐ కె.వెంకటరావు వివరాలను వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు, బంగారం, గంజాయి అక్రమ రవాణాపై విస్తృత తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పలాస రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారాలపై తనిఖీ చేయగా ఆకాష్ కుమార్, ప్రేమజిత్ కుమార్ బ్యాగుల్లో గంజాయి బయటపడిందన్నారు. 41 కిలోల గంజాయి రూ.1.20 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. వీరు బీహార్కు గంజాయిని రైలులో తరలించే క్రమంలో తనిఖీల్లో పట్టుబడినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ షరీఫ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.