30 కుటుంబాలు టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-చెరుకుపల్లి: మండల పరిధిలోని రాంబొట్లపాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ జడ్పిటిసి సభ్యులు పిట్టు శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో వీరందరూ వైసిపికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరినీ రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిటికల్‌ మేనేజర్‌ పూషడపు కుమారస్వామి, పార్టీ నాయకులు రామ్‌ సుబ్బారెడ్డి, అలుమోలు చిరంజీవిరెడ్డి, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️