18 ఏండ్ల తర్వాత తెలంగాణ వాసులకు విముక్తి

Feb 21,2024 11:18 #dubai, #Telangana
  • దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు విడుదల

హైదరాబాద్‌: 18 ఏండ్ల తర్వాత తెలంగాణ వాసులకు విముక్తి దొరికింది. దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులు ఎట్టకేలకు స్వదేశానికి తిరిగొచ్చారు. . ఓ హత్యకేసులో దుబాయ్‌ జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులు విడుదలయ్యారు. వీరు 18ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్‌ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత పదేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్‌ కోర్టు శిక్షను 25 ఏళ్లకు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ నేపాల్ వెళ్లి .. హతుని కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు పరిహారం స్వయంగా చెల్లించి క్షమాభిక్ష పత్రం రాయించినా.. మారిన నిబంధనలతో కోర్టు అంగీకరించలేదు. అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరఫు న్యాయవాదులు మరోసారి ప్రయత్నించారు. దీనికి అంగీకరించిన దుబాయి కోర్టు ఏడేళ్లు ముందే వారిని విడుదల చేసింది. దీంతో దుబాయ్‌ నుంచి సిరిసిల్ల ,రుద్రంగి, కొనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు హైదరాబాద్‌ వచ్చారు. 18 ఏండ్ల తర్వాత కుటుంబసభ్యులను కలుసుకోవడంతో వారంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

➡️