త్వరలో తల్లిదండ్రులు కానున్న దీపికా-రణవీర్‌ దంపతులు

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ బాలీవుడ్‌ జంట రణవీర్‌సింగ్‌, దీపికా పదుకొనేలు శుభవార్త చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కానున్నట్లు ఈ జంట సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. సెప్టెంబర్‌లో తమ బిడ్డకు స్వాగతం చెబుతున్నట్లు ఈ జంట తెలిపింది. పుట్టబోయే బిడ్డకు అవసరమయ్యే అన్నింటిని కలిపి డిజైన్‌ చేసిన ఓ ఫొటోను ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

➡️