ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి గృహ నిర్బంధం విధించారు. విశాఖలో సీఎం జగన్ సిద్ధం పేరిట సభ నేపథ్యం లో ముందస్తు సెక్యూరిటీగా గృహ నిర్బంధం విధించారు. ఈ సందర్భంగా పీతల మూర్తి మాట్లాడుతూ విశాఖ భూదోపిడీలు మీద వైసీపీ పెద్దలను నిలదీసినందుకు తనను అడ్డుకున్నారని విమర్శించారు. సీఎం జగన్ విశాఖ వస్తే ప్రతిపక్షాలు బయటకు రాకుండా పోలీసు వలయాలు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగిపోవడానికి సిద్ధం అని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. జగన్ ను గద్దె దించడానికి తమ అధినేత పవన్ కళ్యాణ్ యుద్ధం ఎప్పుడో ప్రకటించారని తెలిపారు.