కార్టూనిస్ట్ రాముకు జ్యూరీ అవార్డు

Jan 27,2024 14:45 #Konaseema
cartoons competition

ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : గుళ్లపల్లి అరుణ కుమారి స్మారక కార్టూన్ పోటీ 2024లో డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ మాడా రాము ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నారు. ఈ బహుమతి ప్రధాన సభ విజయవాడ బాలోత్సవ భవన్ లో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో పోటీ నిర్వాహకులు, వ్యంగ్య చిత్రకారులు దాస్, బాచి, హాస్యానందం మాసపత్రిక పి.రాము, సాహితీవేత్తలు డా.గుమ్మా సాంబశివరావు, జి.ఎలీషా, పాపర్తి శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొని కార్టూనిస్ట్ రాము ని అభినందించారు.

➡️