Nov 27,2023 19:41
పూజలు చేస్తున్న దృశ్యం

పూజలు చేస్తున్న దృశ్యం
వైభవంగా కార్తీక సోమవారం పూజలు
ప్రజాశక్తి-కోవూరు :కోవూరులోని గాంధీ పార్కు సెంటర్లో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో కార్తీకమాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి సోమవారం సందర్భంగా ప్రాతఃకాలమునే స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనాధం సుబ్బరామయ్య ఆధ్వర్యంలో అభిషేక పూజలను సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా 11 వేల నర్మద బాల లింగాలకు సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను భక్తిశ్రద్ధలతో వెలగించి పూజలు నిర్వ హించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ బి.సురేష్‌, ధర్మకర్తల మండలి సభ్యులు మోహన్‌, హనుమారెడ్డి, రుత్వికులు శేఖర్‌స్వామి. సుబ్బయ్య స్వామి, మురళీస్వామి, వంశీ స్వామి, సుబ్బరావు స్వామి. తదితరులు ఉన్నారు.

➡️