కావాల్సిన పదార్థాలు
మినప పప్పు -1కిలో
జీలకర్ర -4 టీ స్పూన్లు
పచ్చి మిరప కాయలు -100 గ్రాములు
ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం
మినప పప్పును శుభ్రంగా కడిగి ఒక పాత్రలో నీరు పోసి పప్పును రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పప్పును శుభ్రంగా కడిగి పొట్టును వేరుచేయాలి. పచ్చి మిరప కాయల్ని తొక్కి ఆ తొక్కును మినప పప్పు రుబ్బేటప్పుడు వేసి రుబ్బుకోవాలి. తర్వాత జీలకర్ర వేసి పిండిని కలపాలి. ఈ పిండిని మంచం మీద గానీ అరుగు మీద గానీ ఒక గుడ్డ లేదా ప్లాస్టిక్ పేపర్పై చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన వడియాలను రెండు మూడు రోజులు ఎండలో ఎండనివ్వాలి. బాగా ఎండిన తర్వాత గుడ్డ లేదా ప్లాస్టిక్ పేపర్ నుండి వేరు చేసి పొడి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ వడియాలను తగినంత నూనె లేదా నెయ్యిలో వేయించుకుని తింటే ఆ రుచే వేరు!
పెసర వడియాలు
కావాల్సిన పదార్థాలు
పెసర పప్పు -1 కిలో
పచ్చిమిరపకాయలు -
50 గ్రాములు,
ఉల్లిపాయలు -100 గ్రాములు
అల్లం -చిన్న ముక్క
ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం
ముందుగా పెసరపప్పును కొంతసేపు నానబెట్టాలి. తర్వాత పప్పు శుభ్రంగా కడిగి అల్లం, ఉల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మొత్తాన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా రుబ్బుకుంటే పిండి విరిగిపోకుండా ఉంటుంది. రుబ్బిన పిండిని ప్లాస్టిక్ పేపర్పై చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి. మూడు రోజులు ఎండనిచ్చి తర్వాత ప్లాస్టిక్ పేపర్ నుంచి వలిచి పొడి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
గుమ్మడికాయ వడియాలు
కావాల్సిన పదార్థాలు
బూడిద గుమ్మడి కాయ -1 కాయ
మినప పప్పు - కాయకు సరిపడా
పచ్చిమిరప కాయలు -100 గ్రాములు
ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం
బూడిద గుమ్మడి కాయను సన్నగా తురిమి
శుభ్రమైన పలుచటి బట్టలో మూటకట్టాలి. ఈ మూటపై ఏదైనా బరువు పెట్టి రాత్రంతా అలాగే వుంచాలి. ఇలా చేయడం వల్ల గుడ్డలో నుండి నీరంతా దిగిపోతుంది. ఉదయాన్నే గుమ్మడి తురుము గుడ్డలో నుండి తీసి ఒక ప్లేట్లో పెట్టాలి. మినప పప్పును మెత్తగా రుబ్బుకుని ఆ పిండిలో గుమ్మడి కాయ తురుము, ఉప్పు, పచ్చి మిరపకాయ ముక్కలు వేసి కలిపి ప్లాస్టిక్ పేపర్పై గానీ గుడ్డపై గానీ కొంచెం పెద్ద సైజులో వడియాలను పెట్టుకోవాలి. వీటిని నాలుగు రోజులు ఎండలో ఎండబెట్టి పొడి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ వడియాలను ఉల్లిపాయలు లేదా ములక్కాడలతో పాటు వండుకుంటే రుచిగా ఉంటాయి. వీటిని వేయించుకుని చారు కాచుకున్నప్పుడు నంజుకోవచ్చు.
మినప వడియాలు
