ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలతో చర్చలు జరపాలి

Dec 18,2023 15:16 #Kadapa
kadapa anganwadai strike continue 7th day

ప్రజాశక్తి-పోరుమామిళ్ల : అంగన్వాడీల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు యన్ భైరవ ప్రసాద్ పేర్కొన్నారు. అంగన్వాడీలు అంబేద్కర్ విగ్రహం ముందు 7వ రోజు నిరసన కార్యక్రమం తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా పరిపాలిస్తుందని, వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల పట్ల వ్యవహారశీలి చాలా దుర్మార్గంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు కార్యదర్శి మేరీ, దస్తగిరిమ్మ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఓబులాపురం విజయమ్మ, రేణుక, జ్యోతిమ్మ, రమాదేవి, శ్రీదేవి, లక్ష్మీదేవి, అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు మినీ అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు.

➡️