స్వర్ణముఖి నదిలో విద్యార్ధి గల్లంతు

స్వర్ణముఖి నదిలో విద్యార్ధి గల్లంతు

స్వర్ణముఖి నదిలో విద్యార్ధి గల్లంతుప్రజాశక్తి-నాయుడుపేటనాయుడుపేట స్వర్ణముఖి నది లో విద్యార్ధి గల్లంతు అయిన సంఘటన నాయుడుపేట బీడీ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. విద్యానగర్‌లో ఒక ప్రవేట్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ చదువుతున్న అఖిల్‌ (17) సోమవారం నాయుడుపేట లోతువానిగుంత వెనుకవైపు ఉన్న స్వర్ణముఖి నదిలో తన స్నేహితులతో కలిసి సరదాగా వెళ్లి నది లో ఈత కోసం దిగి గల్లంతు అయ్యాడు. తోటి స్నేహితులు గమనించి వెంటనే నదిలోకి దిగి అఖిల్‌ కోసం గాలించారు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ శ్రీనివాసులు రెడ్డి ఘటన స్థలంకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో స్థానికులు అఖిల్‌ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. చుట్టుపక్కల ఎల్‌ ఏ సాగరం, బీడీ కాలనీ, భూపయ్య కాలనీ వాసులు తో పాటు పట్టణం లో జనం భారీగా వచ్చి గుమిగూడారు.

➡️