మహిళలకు ఆటల పోటీలు

Mar 7,2024 22:56

ప్రజాశక్తి – సంతమాగులూరు
ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకంగా మారిందని వెలుగు ఎపిఎం డి మస్తానరావు అన్నారు. మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం జరిగిన ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు ఇల్లూరి లక్ష్మీ శేషు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. స్త్రీలు సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎదుర్కొనే సమస్యలను ఎలా జయించాలో పిహెచ్‌సి డాక్టర్‌ జ్యోత్స్న వివరించారు. అనంతరం మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీసీ వెంకయ్య, అకౌంటెంట్ జి పుష్పరాణి, విఒఎలు, గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

➡️