ఒంగోలులో అంగన్వాడీలు రాస్తారోకో

Dec 22,2023 13:26 #Prakasam District
prakasam anganwadi workers strike on 11th day c

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీల డిమాండ్

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ సీనియర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు ఒంగోలు సిఐటియు జిల్లా కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని సాగర్ లాడ్జి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ రోడ్డుపై అంగన్వాడీ లు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటి యు జిల్లా నాయకులు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. సమస్యలను చర్చలు పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకపోతే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ అంగన్వాడి వర్కర్స్ నాయకులు కే వి సుబ్బమ్మ, కే ప్రశాంతి, జ్యోతి , శ్రీదేవి, నిర్మల ,పద్మ సిఐటియు నగర కార్యదర్శి టి మహేష్ తంబి శ్రీనివాసులు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు .

➡️