కావల్సినవి:పచ్చి కొబ్బరి తురుము - కప్పు, బఠాణీలు- రెండు కప్పులు, పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి- ఆరు, ఉప్పు- రుచికి తగినంత, చింతపండు గుజ్జు- చెంచా, జీలకర్ర- చెంచా, వెల్లుల్లి- ఐదారు రెబ్బలు, నూనె- రెండు చెంచాలు, తాలింపు దినుసులు- రెండు చెంచాలు, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- నాలుగురెబ్బలు.
తయారీ: నూనె వేయకుండా బాణలిలో విడివిడిగా బఠాణీలు, ఎండుమిర్చి వేయించి పెట్టుకోవాలి. తరవాత ఎండుమిర్చి, కొబ్బరి, బఠాణీలను కలిపి అందులో ఉప్పు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీలో తిప్పాలి. తరవాత కాసిని నీళ్లు పోసి మళ్లీ తిప్పాలి. మెత్తగా అయిన మిశ్రమం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేయాలి. దినుసులు వేగాక బఠాణీల మిశ్రమం వేసి కలియతిప్పి దింపేయాలి. దోశల్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది.