జనసేనకు నెల్లూరు జిల్లా అధ్యక్షులు గుడ్‌బై

Apr 10,2024 22:44 #JanaSena, #Nellore District
  •  వైసిపిలో చేరుతానని ప్రకటన

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలో వైసిపిలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం రాత్రి మాగుంట లేఅవుట్‌లోని మనుక్రాంత్‌ నివాసానికి ఎంపిలు, విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి వెళ్లి, మనుక్రాంత్‌రెడ్డిని కలిశారు. పార్టీలోకి రావాలని ఆయనను ఆహ్వానించారు. అనంతరం మనుక్రాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆరేళ్లు పార్టీ కోసం పనిచేశానని, టికెట్‌ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందానని తెలిపారు. జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరుతానని ప్రకటించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైసిపిలో ఆయనకు సముచిత స్థానం లభిస్తుందని అన్నారు.

➡️