ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా పేర్కొంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు సిబిఐ ఛార్జిషీటులో పేర్కొంది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. కాగా, ఇప్పటి వరకు ఆమెను నిందితురాలిగా చేర్చకుండానే సాక్షిగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసి విచారించింది. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల నుంచి సేకరించిన సమాచారం మేరకు కవితను సిబిఐ ప్రశ్నించనున్నట్లు సమాచారం.