కోటేశ్వరరావుకు జాషువా అవార్డు

Mar 4,2024 00:19

ప్రజాశక్తి – చెరుకుపల్లి
మండలంలోని ఆరేపల్లి ఎంపీయూపీ స్కూల్ ఉపాధ్యాయులు మరదాపు కోటేశ్వరరావు జాషువా కళా భూషణ్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతి మినీహాలు నందు ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మహాకవి గుర్రం జాషువా పురస్కారం “కళా భూషణ్” అవార్డు అందుకున్నారు. సుప్రసిద్ధ కవి, వైస్ ఛాన్సలర్ పద్మశ్రీ కొలకలూరి ఐనాక్, సభాధ్యక్షులుగా, సినీ గేయ రచయిత, సుప్రసిద్ధ కవి, కళా రత్న డాక్టర్ చిన్ని కృష్ణ చేతుల మీదుగా ఆయనకు అవార్డు ప్రధానం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయ విధులు నిర్వహిస్తూ సంగీతం, సాహిత్యం, కవి, రచన, హార్మోనియం, హరిచంద్ర, గయోపాఖ్యానం, చింతామణి, రామాయణం, డ్రామాల్లో పాత్రలు, టిటిడి దేవస్థానంలో ఉపన్యాసాలు, భజనలు, ఆధ్యాత్మికవేత్త, సంగీత కుటుంబం, ఉత్తమ ఉపాధ్యాయునిగా అనేక అవార్డులు అందుకున్న మరదపు కోటేశ్వరరావు కళా భూషణ్ అవార్డు అందుకోవడం అభినందనీయమని ఎంఇఒ నవీన్ కుమార్ లాజర్, ఉపాధ్యాయులు కాటూరి నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు.

➡️