హైదరాబాద్: ఫిబ్రవరి 9 నుండి 19 వరకు జరిగే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన పోస్టర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తక పఠనాన్ని పెంపొదించేందుకు పుస్తక ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మన సంస్కృతిలో భాగంగా ప్రతి ఒక్కరు పుస్తక పఠనాన్ని అలవరచుకుంటే సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి ఆర్.శ్రీనివాస్, ఉపాధ్యక్ష్షులు కోయ చంద్రమోహన్లు జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభానికి మంత్రి జూపల్లి కృష్ణారావుని ఆహ్వానించారు.