కావల్సిన పదార్థాలు : మటన్ - రెండు కిలోలు, కారం - కిలోన్నర, ఆవపిండి - పది టీ స్పూన్లు, జీలకర్ర పొడి - పది టీ స్పూన్లు, మెంతిపిండి - పది టీ స్పూన్లు, ఆమ్చూర్ పౌడర్ (ఎండుమామిడి తురుము) - పది టీ స్పూన్లు, పసుపు - రెండు టీ స్పూన్లు, ఉప్పు - కిలో, నూనె - తగినంత.
తాలింపు కోసం : ఎండుమిర్చి - పది, వెల్లుల్లి రెబ్బలు - పావుకిలో, కరివేపాకు - నాలుగు రెబ్బలు, జీలకర్ర - రెండు స్పూన్లు, ఆవాలు - రెండు స్పూన్లు.
తయారుచేసే విధానం : మటన్ను ముక్కలుగా కోసి
శుభ్రంగా కడగాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉడికించి కాసేపు ఎండబెట్టాలి. తర్వాత వాటిని నూనెలో వేయించాలి. చల్లారాక మెంతిపిండి, ఆవపిండి, కారం, జీలకర్రపొడి, ఆమ్చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. కొద్దిగా నూనె వేడిచేసి.. కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో తాలింపు పెట్టాలి. ఈ తాలింపును మటన్ ముక్కల్లో వేసి కలిపి, వేడి చల్లారాక, మూత బిగుతుగా ఉండే జాడీలో ఉంచాలి. పచ్చడి మొత్తం మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టెయ్యాలి. మూడు, నాలుగు రోజులు ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది.
మటన్
