వేటపాలెం వాసికి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు

Feb 28,2024 23:29

ప్రజాశక్తి – చీరాల
ఇండియా ప్రైడ్ అవార్డ్స్ ప్రత్యేక స్థాయిలో ఔత్సాహిక యువ వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తూ వారి రంగాల్లో విశేష కృషి చేసే యువ వ్యాపారవేత్తలకు ప్రధానం చేసే ఇండియన్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్, పొలిటికల్ డిజిటల్ స్ట్రాటజిస్ట్ అఫ్ ది ఇయర్ 2024ను వేటపాలెం వాసి చందు వెంకట సతీష్ అందుకున్నారు. పొలిటికల్ ఇంజనీర్ వ్యవస్థపాకులు చందు వెంకట సతీష్ రామన్నపేటకు చెందిన దిగువ మధ్యతరగతి చేనేత కుటుంబానికి చెందిన నేత కార్మికులు సుబ్బులు, రమణయ్య దంపతుల పెద్ద కుమారుడు. పొలిటికల్ ఇంజనీర్ సంస్థ ద్వారా జాతీయ, ఆంధ్ర, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ రాజకీయ నాయకులతో కలిసి పనిచేస్తూ వారికి అత్యుత్తమ సేవలను అందించేందుకు డిజిటల్ రంగంలో వారిని నియోజకవర్గ ప్రజలతో నిత్యం అనుసంధానం అయ్యేలా చేస్తూ నాయకత్వ శిక్షణలో సేవలు అందిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన ఒత్సాహిక యువ వ్యాపారవేత్తల కరతాళ ధ్వనుల మధ్య ప్రెసిడెంట్ అఫ్ ఇండియా నుండి నారీశక్తి అవార్డు పొందిన రాధాదేవి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డు రావడానికి తోడ్పడిన తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు, గురువులు తనపై విశ్వాసం ఉంచిన నాయకులకు, సంస్థ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

➡️