తిరుమల: తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ, నడకదారి భక్తులకు ఉదయం 8 గంటల నుంచి టైంస్లాట్ కింద టీటీడీ భక్తులకు టోకెన్లను జారీ చేయనుంది. ఉచిత దర్వనానికి 18 గంటల సమయం పడుతుంటే, టైంస్లాట్, సర్వ, దివ్య దర్శనాలకు మూడు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్వనానికి మూడు గంటల సమయం పడుతోంది.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
